పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా, తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శివ పురాణం చెబుతోంది. కాబట్టి మీరు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించి మీ శక్తిమేర పూజలు చేసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అదీగాక శివుడు బోలా శంకరుడు అడిగిన వెంటనే కోరికలు తీరుస్తాడు కాబట్టి పూజలు చేసుకొని సంతోషంగా ఉండండి. ఓం నమశ్శివాయ.
1 . సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, ఆయన పేరు తోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠు , అపస్మారక, క్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతోజీవిస్తారు అని శాస్త్రం చెబుతోంది.
2 . ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది అని శాస్త్రం చెబుతోంది.
3 . ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం సాధిస్తారు.
4 . అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వరంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు కృతార్థత లభిస్తుంది అని శివపురాణం చెబుతోంది చెబుతోంది.
5 శ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుండి. కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ఋషులు చెబుతారు.
6 . ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలూ అంతరించి, శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువు సంభవించదు.
7 . కాశీలో సర్వప్రపంచం చేత సేవించ బడుతన్న విశ్వేశ్వరలింగం ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన మాత్రం చేతేనే సమస్తమైన కర్మబంధాల నుంచీ విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మోక్షాన్నే పొంది కైలాసానికి వెళ్ళి పోతారు.
8 . మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలూ తీరుతాయి. అపవాదులు నశిస్తాయి. మీ జీవితం కూడా చీకట్లు తొలగి వెలుగు వైపు వెళుతుంది.
9 . చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని శివ పురాణంలో చెప్పబడింది.
10 . నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనార్చనాదుల వలన సమస్తమైన భయాలే కాకుండా, మహాపాతక ఉపపాతకాలు కూడా నశించిపోతాయి అని శాస్త్రవచనం.
11 . శ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనూనే విరాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని శివపురాణం చెబుతోంది.
12 ‘ఘృష్ణేశ్వరుడు’ శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ వారి జీవితం సుఖమయం చేసింది.
కాబట్టి మీరు శివునికి అతి ముఖ్యమైన ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుకుని ముక్తిని పొందగలరని ఆశిస్తున్నాను.
Dhwadasa Jyothirlingala Gurinchi Chhala Chakkaga Vivarinchinanduku Meeku Manaspoorthiga Danyavadhamulu Sir
పది పైసల అగరొత్తులు…..పావలా కర్పూరం……వెలిగించి పదే పదే పడి పడి నీ కష్టాలు తీర్చమని దేవుడిని మొక్కుతావు!
ఆ దేవుడు నీకు జన్మనిచ్చింది నీ కష్టాలు తీర్చడానికి కాదు. నువ్వు మరొకరి కష్టాలు తీరుస్తావని ఒకరికి చేతనైన సాయం నువ్వు చేస్తే ఆ దేవుడు నీకు చేయాల్సింది చేస్తాడు……!
ద్వాదశ జ్యోతిర్లింగాల విశిష్టతలు వాటిని గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు స్వామిజీ అశోక్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను 🙏🙏🙏
Nice
Excellent 👌👌 information